యాప్నగరం

రేపే జేఎఫ్‌సీ తొలి భేటీ: పాల్గొననున్న పవన్, జేసీ, ఉండవల్లి

ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీల అమలు కోసం గురువారం తొలి జేఎఫ్‌సీ సమావేశం జరగనుంది.

TNN 15 Feb 2018, 8:43 pm
ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీల అమలు కోసం గురువారం తొలి జేఎఫ్‌సీ సమావేశం జరగనుంది. ఫిబ్రవరి 16న మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్‌లో దసపల్లా హోటల్లో జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. మరుసటి రోజు కూడా భేటీ కొనసాగుతుందని జనసేన పార్టీ తెలిపింది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్‌తోపాటు జేపీ, ఉండవల్లి అరుణ్ కుమార్, కొణతాల రామకృష్ణ తదితర నేతలు పాల్గొననున్నారు. వామపక్ష నేతలతోపాటు పలు రంగాలకు చెందిన నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
Samayam Telugu joint fact finding committee first meeting will be held tomorrow
రేపే జేఎఫ్‌సీ తొలి భేటీ: పాల్గొననున్న పవన్, జేసీ, ఉండవల్లి


గురువారం ఉదయం ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పవన్ కల్యాణ్ పూలమాల వేసి అంజలి ఘటిస్తారు. అనంతరం జేఎఫ్‌సీ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తారని జనసేన స్పష్టం చేసింది.

కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సాయం, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకు ఫిబ్రవరి 15లోగా తనకు శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కల్యాణ్ ఏపీ సర్కారును డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించిన నేపథ్యంలో జేఎఫ్‌సీ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.