యాప్నగరం

టీ-కాంగ్రెస్‌కు కేసుల కలవరం.. హౌసింగ్ సొసైటీ కేసులో రేవంత్‌ రెడ్డికి నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న కేసులు.. మొన్న జగ్గారెడ్డి.. నిన్న గండ్ర వెంకట రమణారెడ్డి.. నేడు రేవంత్ రెడ్డి.

Samayam Telugu 12 Sep 2018, 2:24 pm
జగ్గారెడ్డి అరెస్ట్ తర్వాత గండ్ర వెంకట రమణారెడ్డిపై కేసు, రేవంత్ రెడ్డికి నోటీసులు రావడం తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. 2001 హౌసింగ్ సొసైటీ కేసులో రేవంత్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో నకిలీ డాక్యుమెంట్లతో ఇళ్ల స్థలాలను కేటాయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రేవంత్‌తో పాటూ మరో 13మందికి నోటీసులు పంపారు. 15రోజుల్లోపు వివరణ ఇచ్చి.. విచారణకు హాజరు కావాలని కోరారు. జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులపై రేవంత్ కూడా స్పందించారు. తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నందున కొంత సమయం కావాలని ఆయన మరో లేఖ రాశారు.
Samayam Telugu Revanth Reddy


టీఆర్ఎస్ సర్కార్ కక్షసాధింపు చర్యలు పాల్పడుతోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఉద్దేశకపూర్వకంగానే ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి దాడులు చేయిస్తున్నారని.. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న నేతల్ని కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. జగ్గారెడ్డి కంటే ముందు తననే టార్గెట్ చేశారని.. తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గండ్రపై కూడా అక్రమంగా కేసు పెట్టారన్న రేవంత్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అష్టదిగ్బంధం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

చర్లపల్లి జైల్లో 40 రోజులు ఉన్నానని.. తాను కేసులకు మాత్రం భయపడేది లేదంటున్నారు రేవంత్. కేసీఆర్‌కు సహకరించే అధికారులంతా భారీ మూల్యం చెల్లించకోక తప్పదన్న ఆయన.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లించుకోక తప్పదన్నారు. కొందరు అధికారుల పేర్లు డైరీలో కూడా రాసి పెడుతున్నానన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.