యాప్నగరం

మక్కా మసీదు కేసు: ఎన్‌ఐఏ కోర్టు జడ్జి రాజీనామా

మక్కా మసీదు కేసులో తీర్పును ప్రకటించిన జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆయన తన రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 16 Apr 2018, 6:59 pm
మక్కా మసీదు కేసులో తీర్పును ప్రకటించిన జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆయన తన రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపినట్లు తెలుస్తోంది. తీర్పును ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన ఇలా చేయడం కలకలంరేపుతోంది. ఆయన నిర్ణయానికి కారణాలు కూడా తెలియడం లేదు. రవీందర్ రెడ్డి జడ్జిగానే కాకుండా...తెలంగాణ జ్యుడిషియల్ అధికారుల సంఘం నాయకుడిగా కొనసాగుతున్నారు. కీలక తీర్పును ప్రకటించిన తర్వాత జడ్జి రాజీనామా చేయడం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది.
Samayam Telugu Judge...


రవీందర్ రెడ్డి రాజీనామాపై ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. రాజకీయ ఒత్తిళ్లు కూడా కారణమై ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మక్కా మసీదు కేసులో ఇవాళే తీర్పు రాగా... ఈ కేసులో నిందితులందర్నీ నాంపల్లి ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.