మిగిలిన వారూ కారెక్కేస్తున్నారు !
కాంగ్రెస్, టిడిపి నుంచి మిగిలిన వారు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి.
TNN 30 May 2016, 4:18 pm
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో ప్రతిపక్ష పార్టీలన్నీ కకావికలమైపోయాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోతుండగా, తెలుగు దేశం పార్టీ తెలంగాణలో ఒక అనాధలా మిగిలిపోయింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే అడ్రస్ లేకుండా పోయింది. తాజాగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు మరో భారీ షాక్ తగలబోతోందనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నల్లగొండ జిల్లా నుంచి కీలక నేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ జూన్ మొదటి వారంలోనే టీఆర్ఎస్ లో చేరే ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే గనక జరిగితే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంది.
మరోవైపు ఇప్పటికే షాక్ లో టి.టిడిపికి దెబ్బ మీద దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ఓటు నోటు కేసులో ఇరుక్కున ఎమ్మెల్యేలు తప్ప అందరూ ఎప్పుడో కారెక్కేసి పార్టీని అనాధను చేసి వెళ్ళిపోయారు. తాజాగా తెలంగాణ టిడిపిలో మిగిలిన ఏకైక ఎంపి కూడా టీఆర్ఎస్ పార్టీలో లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టిడిపి ఎంపి మల్లారెడ్డి త్వరలోనే గులాబీ కండువా కప్పుకోవటం ఖాయంగా తెలుస్తోంది. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రజాదరణను చూసి పార్టీ మారటమే మంచిదని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ఇదే విషయమై తన అనుచరులతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, టిడిపి నుంచి కీలక నేతలు సిఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. చివరకు టి.టిడిపిలో రేవంత్ రెడ్డి ఒక్కడే మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు.
మరోవైపు ఇప్పటికే షాక్ లో టి.టిడిపికి దెబ్బ మీద దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి ఓటు నోటు కేసులో ఇరుక్కున ఎమ్మెల్యేలు తప్ప అందరూ ఎప్పుడో కారెక్కేసి పార్టీని అనాధను చేసి వెళ్ళిపోయారు. తాజాగా తెలంగాణ టిడిపిలో మిగిలిన ఏకైక ఎంపి కూడా టీఆర్ఎస్ పార్టీలో లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టిడిపి ఎంపి మల్లారెడ్డి త్వరలోనే గులాబీ కండువా కప్పుకోవటం ఖాయంగా తెలుస్తోంది. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రజాదరణను చూసి పార్టీ మారటమే మంచిదని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ఇదే విషయమై తన అనుచరులతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, టిడిపి నుంచి కీలక నేతలు సిఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. చివరకు టి.టిడిపిలో రేవంత్ రెడ్డి ఒక్కడే మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు.