యాప్నగరం

జగన్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్సీ వ్యాఖ్యలు.. టీడీపీలో కొత్త వివాదం

రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ జూపూడి. రాజేంద్రప్రసాద్ జోకర్‌లా వ్యాఖ్యలు చేయడం ఏంటి.. సీరియస్ అంశాల పట్ల ఇలాంటి ఆరోపణలు చేయడం పద్దతి కాదు. ఆ వ్యాఖ్యలను రాజేంద్రప్రసాద్ విజ్ఞతకే వదిలేస్తున్నా.

Samayam Telugu 30 Oct 2018, 7:57 pm
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి ఘటన రాజకీయంగా సెగలు రేపుతోంది. వైసీపీ-టీడీపీల మధ్య మాటల మంటను పెంచేస్తోంది. ఇరు పార్టీల నేతలు.. ఈ ఘటనపై దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ గొడవ ఇలా ఉంటే.. టీడీపీలో సరికొత్త వివాదం మొదలయ్యింది. జగన్‌పై దాడి ఘటనలో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యల్ని సొంత పార్టీ నేత తప్పుబట్టడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
Samayam Telugu Jupudi.


టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్ జోకర్‌లా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీరియస్ అంశాల పట్ల ఇలాంటి ఆరోపణలు చేయకూడదని సూచించారు. సినిమాల్లో కామెడీ క్యారెక్టర్‌లా నేతలు వ్యవహరించ కూడదని.. ఆయన వ్యవహరించిన తీరు మొత్తం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు. ఆ వ్యాఖ్యలను రాజేంద్రప్రసాద్ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు.

రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే..
జగన్‌పై దాడి వెనక ఉన్నది ఆయన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలేనని ఆయన ఆరోపించారు. ఇద్దరూ కలిసే జగన్‌పై హత్యాయత్నం చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఏమన్నా జరిగితే.. ఆయన వారసులుగా షర్మిల, విజయమ్మ బయటకొస్తారు. ఆ సానుభూతి ఓట్లతో అధికారంలోకి రావొచ్చు, గద్దెనెక్కవచ్చు అనే కుట్రపూరితమైన, నేరపూరితమైన ఆలోచనతోనే హత్యాయత్నం చేయించారనేది తన ప్రగాఢ విశ్వాసమన్నారు ఎమ్మెల్సీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.