యాప్నగరం

ఉమ్మడి హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్ ప్రమాణం..

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ శనివారం (జులై 7) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమలో గవర్నర్‌ నరసింహన్‌, రాధాకృష్ణన్‌ చేత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు.

Samayam Telugu 7 Jul 2018, 3:32 pm
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ శనివారం (జులై 7) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమలో గవర్నర్‌ నరసింహన్‌, రాధాకృష్ణన్‌ చేత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. దీంతో ఉమ్మడి హైకోర్టుకు 93వ చీఫ్ జస్టిస్‌గా రాధాకృష్ణన్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Samayam Telugu HCCJ


59 సంవత్సరాల తొట్టథిల్‌ భాస్కరన్‌ నాయర్‌ రాధాకృష్ణన్‌ 1959 ఏప్రిల్‌ 29న కేరళలోని కొల్లాంలో జన్మించారు. కర్నాటక కేజీఎఫ్‌ న్యాయకళాశాల నుంచి ఆయన న్యాయవిద్య పూర్తిచేశారు. 2004లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 నుంచి ఛత్తీస్‌గడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే.. 15 నెలల పాటు అక్కడ బాధ్యతలు నిర్వహించిన రాధాకృష్ణన్‌ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.