యాప్నగరం

ఒంటిమిట్ట చెరువులో 7 మృతదేహాలు.. ఎవరైనా హత్య చేశారా?

కడప జిల్లా ఒంటిమిట్టలో విషాద ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక చెరువులో 7 మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు ఎర్రచందనం కూలీలు అయంటారని భావిస్తున్నారు.

TNN 18 Feb 2018, 5:55 pm
కడప జిల్లా ఒంటిమిట్టలో విషాద ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక చెరువులో 7 మృతదేహాలు బయటపడ్డాయి. చెరువు వైపు వెళుతున్న స్థానికులు అందులో మృతదేహాలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీయిస్తున్నారు. మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. మృతులు ఎర్రచందనం కూలీలు అయంటారని భావిస్తున్నారు.
Samayam Telugu kadapa 7 dead bodies found in vontimitta lake
ఒంటిమిట్ట చెరువులో 7 మృతదేహాలు.. ఎవరైనా హత్య చేశారా?


వారిని ఎవరైనా హత్య చేశారా? లేదా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చెరువులో దూకి మరణించారా అనేది తేలాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు ఒంటిమిట్ట చెరువు వద్దకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.