కడప జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అమితుమి తలపడుతున్నాయి. ఎవరికి వారు తమకే బలముందని అంటున్నారు. క్యాంపు రాజకీయాలతో పోరాటాన్ని రసవత్తరంగా మార్చాయి ఈ ఇరుపార్టీలు. తెలుగుదేశం పార్టీ తన క్యాంపును పాండిచ్చేరిలో నిర్వహిస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బెంగళూరు వేదికగా క్యాంపును నడుపుతోంది.
వాస్తవ బలాబలాలను చూస్తే కడప జిల్లా స్థానిక సంస్థల సభ్యుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఈ లెక్కన ఈ స్థానాన్ని ప్రతిపక్ష పార్టీ సునాయాసంగా సొంతం చేసుకోవాల్సింది. అయితే.. ఫిరాయింపుదారులైన స్థానిక సంస్థల సభ్యుల బలాన్ని ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. తమ వైపున మెజారిటీ ఓటర్లు ఉన్నారని తెలుగుదేశం పార్టీ అంటోంది.
కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటింగ్ అర్హత కలిగిన వారు 841 మంది ఉన్నారు. వీరంతా జిల్లాలోని స్థానిక సంస్థల . కనీసం 422 మంది స్థానిక సంస్థల సభ్యులున్న వారు సునాయాసంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిల ఫలితాన్ని గమనిస్తే.. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారు ఆరువందల మందికి పైనే. అంటే దాదాపు రెండు వందల మంది ఓటర్లు ఫిరాయిస్తేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి అవకాశం ఉంటుంది.
వ్యత్యాసం భారీగానే ఉన్నా విజయం పట్ల తెలుగుదేశం పార్టీ విశ్వాసంతో కనిపిస్తోంది. తెలుగుదేశం తరపున బీటెక్ రవి అభ్యర్థిగా ఉండగా, వైకాపా తరపున వైఎస్ వివేకానందరెడ్డి పోటీలో ఉన్నాడు. తెలుగుదేశం అక్రమాలకు పాల్పడుతోంది, విజయం మాత్రం మాదే అని వైకాపా అంటోంది. మార్చి 17 వ తేదీన పోలింగ్ జరగనుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో!
వాస్తవ బలాబలాలను చూస్తే కడప జిల్లా స్థానిక సంస్థల సభ్యుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఈ లెక్కన ఈ స్థానాన్ని ప్రతిపక్ష పార్టీ సునాయాసంగా సొంతం చేసుకోవాల్సింది. అయితే.. ఫిరాయింపుదారులైన స్థానిక సంస్థల సభ్యుల బలాన్ని ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. తమ వైపున మెజారిటీ ఓటర్లు ఉన్నారని తెలుగుదేశం పార్టీ అంటోంది.
కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటింగ్ అర్హత కలిగిన వారు 841 మంది ఉన్నారు. వీరంతా జిల్లాలోని స్థానిక సంస్థల . కనీసం 422 మంది స్థానిక సంస్థల సభ్యులున్న వారు సునాయాసంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిల ఫలితాన్ని గమనిస్తే.. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారు ఆరువందల మందికి పైనే. అంటే దాదాపు రెండు వందల మంది ఓటర్లు ఫిరాయిస్తేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి అవకాశం ఉంటుంది.
వ్యత్యాసం భారీగానే ఉన్నా విజయం పట్ల తెలుగుదేశం పార్టీ విశ్వాసంతో కనిపిస్తోంది. తెలుగుదేశం తరపున బీటెక్ రవి అభ్యర్థిగా ఉండగా, వైకాపా తరపున వైఎస్ వివేకానందరెడ్డి పోటీలో ఉన్నాడు. తెలుగుదేశం అక్రమాలకు పాల్పడుతోంది, విజయం మాత్రం మాదే అని వైకాపా అంటోంది. మార్చి 17 వ తేదీన పోలింగ్ జరగనుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో!