ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా సాయంత్రం జరిగే హెచ్సీయూ సభలో పాల్గొంటానని జేఎన్యూ విద్యార్ధి నేత కన్నయ్య కుమార్ స్పష్టం చేశాడు. హెచ్ సీయూలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు బుధవారం మధ్యాహ్నం కన్నయ్యకుమార్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని ఆరోపించాడు.సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఎట్టి పరిస్థితిల్లోనూ పాల్గొంటానని పేర్కొన్నాడు. వర్శిటీలలో సామాజిక న్యాయంపై తన పోరాటం కొనసాగిస్తానని వెల్లడించాడు. నిర్భయ చట్టంలాగే దళిత విద్యార్ధులను వేదింపులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షించేలా రోహిత్ పేరుతో చట్టం తీసుకురావాలని కన్నయ్యకుమార్ ఈ సంద్భంగా డిమాండ్ చేశాడు.
హెచ్సీయూ సభలో పాల్గొని తీరుతా - కన్నయ్య
ఎట్టకేలకు జేెఎన్యూ విద్యార్ధి నేత కన్నయ్య కుమార్ హైదరాబాద్లో అడుగుపెట్టాడు.
TNN 23 Mar 2016, 1:05 pm