యాప్నగరం

‘మోడీ మళ్లీ ప్రధాని కావాలని బాబు తీర్మానం’

‘2017 ఏప్రిల్ 17న జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో మోడీ మళ్లీ ప్రధాని కావాలి.. అని తీర్మానించింది తెలుగుదేశం అధినేత

Samayam Telugu 4 Jun 2018, 5:15 pm
‘2017 ఏప్రిల్ 17న జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో మోడీ మళ్లీ ప్రధాని కావాలి.. అని తీర్మానించింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే. మోడీ పాలన బాగుందని, ఆయనే మళ్లీ ప్రధాని కావాలని బాబు ఆ రోజు అన్నారు. తీర్మానాన్ని కూడా ప్రతిపాదించారు. అయితే ఇంతలోనే చంద్రబాబు నాయుడు తీరు ఎందుకు మారింది?’ అంటూ బాబుపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షడు కన్నా లక్ష్మినారాయణ.
Samayam Telugu kanna_b


మోదీ ఏపీని మోసం చేశారని చంద్రబాబు విరుచుకుపడుతున్న నేపథ్యంలో కన్నా ఎదురుదాడి చేశారు. నాలుగేళ్ల పాటు మోడీని బాబు మెచ్చుకున్నారని.. ఇప్పుడు రాజకీయ అవసరం కోసం విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు చాలా అబద్ధాలు చెబుతున్నారని, వాటన్నింటికీ ఆయన వివరణ ఇచ్చుకోవాలని కన్నా అన్నారు. అవినీతి ద్వారా సంపాదించుకోవడాన్ని ఇకనైనా తగ్గించి రాష్ట్రాన్ని సరిగా పాలించాలని చంద్రబాబుకు హితవు పలికారు.

తమపార్టీకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు అక్రమ సంబంధం అంటగడుతున్నారని, ఇలా బురదజల్లి వెళ్లిపోయే విధానాలను చంద్రబాబు నాయుడు ఆపాలని కన్నా అన్నారు. పోలవరంలో అవినీతి జరుగుతోందని, టీటీడీలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని అన్నారు. చంద్రబాబు చేతగాని తనంతో ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఏపీకి వచ్చే నిధులను వినియోగించుకోలేకపోయారని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.