యాప్నగరం

బాబు ఢిల్లీ పర్యటనల రహస్యమదే: కన్నా

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నా లక్ష్మినారాయణ.

Samayam Telugu 22 May 2018, 3:53 pm
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నా లక్ష్మినారాయణ. నాలుగేళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో కలిసి సాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీని విమర్శించడాన్ని కన్నా తప్పు పడ్డారు. బాబు తన స్వార్థ ప్రయోజనాలతో వ్యవహరిస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక మార్లు ఢిల్లీకి వెళ్లాను అని చంద్రబాబు చెబుతున్నారని.. అయితే బాబు ఢిల్లీ పర్యటనలకు వెళ్లింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని కన్నా వ్యాఖ్యానించారు.
Samayam Telugu kanna2


బాబు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రెండే విషయాల గురించి అడిగే వారని.. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు? ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను ఎప్పుడు పెంచుతారు? అనే అంశాల గురించినే భారతీయ జనతా పార్టీ పెద్దల వద్దన చంద్రబాబు వాకబు చేసేశారని, వీటి కోసమే బాబు ఢిల్లీ పర్యటనలు చేపట్టారని కన్నా వ్యాఖ్యానించారు.

ఢిల్లీ వెళ్లినప్పుడు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి బీజేపీ నేతలతో మాట్లాడలేదని.. తన ప్రయోజనాల కోసమే ప్రయత్నాలు చేశారని కన్నా అన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధి ఉంటే కేంద్ర నాయకత్వం కూడా మరింత సహకారం అందించేదని అయితే బాబుకు రాష్ట్రం పట్టలేదన్నారు.

ప్రస్తుతం చంద్రబాబు ప్రత్యేకహోదా కావాలని అంటున్నారని.. అయితే ఇదే అంశంపై ఆయన ఎంత గందరగోళంతో మాట్లాడారో, ఎన్ని సార్లు మాట మార్చారో అందరికీ తెలుసు అని కన్నా అన్నారు. తన అవసరాలకు అనుగుణంగా మాటలు మార్చే చంద్రబాబును ప్రజలు విశ్వసించరని కన్నా అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.