యాప్నగరం

బాబుపై టీడీపీ సీనియర్ నేత నిరసన స్వరం!

ఈ విషయంపై ఆయనతోనే తేల్చుకుంటాను అని ఆవేశపూరితంగా అన్నారు.

TNN 20 May 2017, 9:25 am
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్ర ఆగ్రహోద్రిక్తులయ్యారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిరసన స్వరాన్ని వినిపించారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో తన అనుచరులిద్దరు హత్యకు గురవ్వడంపై ఆవేదన భరితుడయిన కరణం.. ఈ హత్యలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయంపై ఆయనతోనే తేల్చుకుంటాను అని కరణం ఆవేశపూరితంగా అన్నారు.
Samayam Telugu karanam fires on cbn
బాబుపై టీడీపీ సీనియర్ నేత నిరసన స్వరం!


వేమవరానికి చెందిన అంజయ్య, రామకోటేశ్వరరావుల హత్యల వెనుక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హస్తం ఉన్నట్టుగా కరణం ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన గొట్టిపాటిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి, తమపై రుద్ది.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చంద్రబాబు చిచ్చు పెట్టారని కరణం వ్యాఖ్యానించారు. తమ అనుచరులను అకారణంగా గొడవల్లోకి లాగి వారి ప్రాణాలను తీశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవలే గొట్టిపాటి వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రత్యర్థి తెలుగుదేశంలో చేరడం పట్ల కరణం ఆది నుంచినే అసహనంతో ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి కరణం బలరాం ను బాబు చల్లబరిచారు. ఇంతలోనే కరణం అనుచరులు ఇద్దరు హత్యకు గురయ్యారు. ఇది గొట్టిపాటి పనే అని కరణం వర్గం ఆరోపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.