నిరుపేద కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు జరిపించడానికి కూడా అనేక ఇబ్బందులు పడతారు. జీవితంలో ఏం సాధించారనే విషయాన్ని పక్కనబెడితే చనిపోయిన వారిని ఘనంగా సాగనంపాలని అందరూ భావిస్తారు. అలాంటి అభాగ్యుల కోసం కరీంనగర్ నగరపాలక సంస్థ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. తమ కుటుంబసభ్యులు మరణిస్తే వారి అంత్యక్రియల విషయంలో నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క రూపాయి పథకాన్ని ప్రవేశపెట్టింది.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక్క రూపాయికే అంత్యక్రియలు జరిపించాలని నిర్ణయించినట్లు కరీంనగర్ మేయర్ రవీందర్సింగ్ ప్రకటించారు. సోమవారం ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగర పరిధిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు రూపాయి చెల్లిస్తే నగరపాలక సంస్థ తరఫున అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందు కోసం నగరపాలక సంస్థ రూ.1.50 కోట్లు కేటాయించిందని, ప్రత్యేకంగా రెండు వ్యాన్లు, ఫ్రీజర్, ఇతర సామగ్రి కొనుగోలు చేయనున్నట్టు వివరించారు. ఈ పథకం జూన్ 15 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం నగరపాలక సంస్థలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతేకాదు, పట్టణ ప్రజలకు శ్మశానవాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాల్టీలదేనని మేయర్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే రూపాయికే అంత్యక్రియల కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇంటి వద్ద నుంచి శ్మశానవాటిక వరకు వాహనం, దహన సంస్కారాలకు సంబంధించి ఇతర ఏర్పాట్లన్నీ బల్దియానే సమకూరుస్తుందని పేర్కొన్నారు. అలాగే కర్మకాండలకు సంబంధించిన విషయంలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ‘అంతిమ యాత్ర-ఆఖరి సఫర్’పేరిట అమల్లోకి తీసుకోచ్చే ఈ పథకాన్ని అన్నివర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఏవరైనా చనిపోతే వారి గురించి బల్దియాకు సమాచారం అందించి రూపాయి చెల్లిస్తే ప్రత్యేక సిబ్బంది ఇంటికి వెళ్లి దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంతిమయాత్రకు వాహనం, బాడీ ఫ్రీజర్, చితికి ఉచితంగా కట్టెలు, కిరోసిన్ అందజేస్తారు. ఖననం చేస్తే గుంతను తవ్విస్తారు. అలాగే అంత్యక్రియల రోజున 50 మందికి రూ.5కే భోజన సదుపాయం కల్పిస్తారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక్క రూపాయికే అంత్యక్రియలు జరిపించాలని నిర్ణయించినట్లు కరీంనగర్ మేయర్ రవీందర్సింగ్ ప్రకటించారు. సోమవారం ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగర పరిధిలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు రూపాయి చెల్లిస్తే నగరపాలక సంస్థ తరఫున అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందు కోసం నగరపాలక సంస్థ రూ.1.50 కోట్లు కేటాయించిందని, ప్రత్యేకంగా రెండు వ్యాన్లు, ఫ్రీజర్, ఇతర సామగ్రి కొనుగోలు చేయనున్నట్టు వివరించారు. ఈ పథకం జూన్ 15 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం నగరపాలక సంస్థలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతేకాదు, పట్టణ ప్రజలకు శ్మశానవాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మున్సిపాల్టీలదేనని మేయర్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే రూపాయికే అంత్యక్రియల కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇంటి వద్ద నుంచి శ్మశానవాటిక వరకు వాహనం, దహన సంస్కారాలకు సంబంధించి ఇతర ఏర్పాట్లన్నీ బల్దియానే సమకూరుస్తుందని పేర్కొన్నారు. అలాగే కర్మకాండలకు సంబంధించిన విషయంలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ‘అంతిమ యాత్ర-ఆఖరి సఫర్’పేరిట అమల్లోకి తీసుకోచ్చే ఈ పథకాన్ని అన్నివర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఏవరైనా చనిపోతే వారి గురించి బల్దియాకు సమాచారం అందించి రూపాయి చెల్లిస్తే ప్రత్యేక సిబ్బంది ఇంటికి వెళ్లి దహన సంస్కారాలకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంతిమయాత్రకు వాహనం, బాడీ ఫ్రీజర్, చితికి ఉచితంగా కట్టెలు, కిరోసిన్ అందజేస్తారు. ఖననం చేస్తే గుంతను తవ్విస్తారు. అలాగే అంత్యక్రియల రోజున 50 మందికి రూ.5కే భోజన సదుపాయం కల్పిస్తారు.