యాప్నగరం

సీఎం జగన్‌తో కర్ణాటక సీఎం మర్యాదపూర్వక భేటీ

కర్ణాటక సీఎం కుమారస్వామి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

Samayam Telugu 15 Jun 2019, 6:54 pm
ర్ణాటక సీఎం కుమారస్వామి.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం (జూన్ 15) మధ్యాహ్నం ఇరువురు నేతలు భేటీ అయ్యారు. తనను కలవడానికి వచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రిని సీఎం వైఎస్ జగన్.. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తాజా రాజకీయ అంశాలు, నదీ జలాల వివాదాల పరిష్కారం, రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం కుమారుడు నిఖిల్ గౌడ ఇటీవల అమరావతిలో సీఎం జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. తమ లాంటి యువకులకు జగన్ స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు.
Samayam Telugu cms
సీఎం జగన్‌తో కర్ణాటక సీఎం


ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యే నిమిత్తం ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. శనివారం ఉదయం ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం సీఎం అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం కుమారస్వామి హాజరైనట్లు తెలుస్తోంది.

పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించే దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. భారీ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. మే 30న అమరావతిలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.