యాప్నగరం

కర్ణాటక సీఎం కొడుకు.. ఆంధ్రా అల్లుడు కానున్నాడా?

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు ఆంధ్రా అల్లుడు కాబోతున్నాడట. ఇంతకీ అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

Samayam Telugu 31 Aug 2018, 6:00 pm
ర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామి ఆంధ్రప్రదేశ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయన శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం గేట్‌వే హోటల్‌లో సీఎం చంద్రబాబుతో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు.
Samayam Telugu Untitled


అయితే, కుమారస్వామి విజయవాడకు వచ్చింది తన కుమారుడు నిఖిల్‌కు పెళ్లి సంబంధం కుదుర్చుకోడానికేనని వార్తలు వస్తున్నాయి. విజయవాడలోని ప్రాఫిట్ షూ అధినేత బోడెపూడి శివకోటేశ్వరరావు కుమార్తె సహజతో నిఖిల్ వివాహం నిశ్చయించేందుకు కుటుంబ సమేతంగా విచ్చేసినట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని కుమారస్వామి కొట్టిపడేశారు. అలాంటిది ఏమీ లేదని, తాము అమ్మవారి దర్శనానికి మాత్రమే వచ్చామని తెలిపారు.

దీనిపై కోటేశ్వరరావు స్పందిస్తూ.. ‘‘కుమార స్వామి మా ఫ్యామిలీ ఫ్రెండ్. విజయవాడ వచ్చారని తెలియడంతో మా ఇంటికి భోజనానికి ఆహ్వానించాం. మా అమ్మాయికి, ఆయన కుమారుడు నిఖిల్‌కు పెళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని స్పష్టం చేశారు. అయితే, వీరి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినా, పెళ్లి సంబంధం మాటలు జరిగిన మాట వాస్తవమేనని విశ్వసనీయవర్గాలు తెలుపుతున్నాయి. వీరికి మాజీ ఎంపీ లగడపాటి మధ్యవర్తిత్వం వహించారని చెబుతున్నారు.

కుమారస్వామి కుమారుడు నిఖిల్ హీరోగా పలు సినిమాల్లో నటించారు. ఆయన నటించిన మొదటి చిత్రం ‘జాగ్వర్’ను తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. తాజాగా ఆయన ‘మునిరత్న కురుక్షేత్ర’, ‘సీతారామ కల్యాణ’ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. కోటేశ్వరరావు కుమార్తె సహజతో రెండేళ్ల కిందటే నిఖిల్‌కు పరిచయం ఉందని, ఈ నేపథ్యంలో వారిద్దిరికి వివాహం చేయాలని నిర్ణయించడంతో కుమారస్వామి కుటుంబ సమేతంగా విజయవాడ విచ్చేసినట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.