యాప్నగరం

రాజమౌళిని కూడా వదలని కత్తి మహేష్

పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ.. నిత్యం వార్తల్లో ఉండే సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఈ సారి రాజమౌళిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

TNN 15 Dec 2017, 4:24 pm
పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి విమర్శలు చేస్తూ.. నిత్యం వార్తల్లో ఉంటున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన పవన్ అభిమానుల్నిగానీ, జనసేనాని గానీ విమర్శించ లేదు. అమరావతి అసెంబ్లీ డిజైన్ల సందర్భంగా.. దర్శక ధీరుడు రాజమౌళిని పరోక్షంగా తప్పుబడుతూ ఆయన విమర్శలు చేశాడు. అసెంబ్లీ సెంట్రల్ హాల్లో తెలుగు తల్లి పాదాలపై సూర్య కిరణాలు పడేలా రూపొందించిన గ్రాఫిక్స్ వీడియోను రాజమౌళి విడుదల చేశారు.
Samayam Telugu kathi mahesh criticizes rajamoulis telugu thali design
రాజమౌళిని కూడా వదలని కత్తి మహేష్


ఎత్తయిన టవర్‌ నుంచి అసెంబ్లీ సెంట్రల్‌ హాలులోకి సూర్యకిరణాలు పడేలా నార్మన్‌ ఫోస్టర్‌ డిజైన్‌ రూపొందించింది. దీనికి తన కళాత్మకతను జోడించిన రాజమౌళి ఉదయం 9:15 గంటలకు సెంట్రల్ హాల్లోని తెలుగు తల్లి విగ్రహంపై సూర్య కిరణాలు పడేలా ఏర్పాటు చేయాలని సూచించారు.


తెలుగు తల్లి విగ్రహంపై సూర్యకిరణాలు పడటం గురించి కత్తి మహేష్ స్పందించాడు. ‘తొలి కిరణం.. తెలుగు తల్లి పాదాలను తాకకపోతే వచ్చే నష్టం ఏదైనా ఉందా..?’ అని ప్రశ్నిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. కొందరు కత్తి వాదనతో ఏకీభవిస్తుండగా.. మరి కొందరు మాత్రం అతడి తీరును తప్పుబడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.