యాప్నగరం

కవాతు వేళ.. జనసేనానిపై కత్తి మహేష్ వ్యాఖ్యలు

హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన కత్తి మహేష్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నారు. ఆదివారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడారు.

Samayam Telugu 15 Oct 2018, 11:58 am
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ధవళేశ్వరం బ్యారేజ్‌పై ‘జనసేన కవాతు’కు సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిచ్చుక లంక నుంచి సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వరకు నిర్వహించే ఈ కవాతులో భారీ ఎత్తున జనసైనికులు పాల్గోబోతున్నారు. జనసేన బలాన్ని, సైన్యాన్ని ప్రత్యర్థులకు చూపించడానికి పవన్ ఈ కవాతును నిర్వహిస్తున్నారు. జనసేన కవాతుకు పవన్ సిద్ధమవుతున్న వేళ.. వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్ తన నోటికి పనిచెప్పారు. మరోసారి పవన్‌ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu Kathi


హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన కత్తి మహేష్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ‘మాదిగల రాజకీయ చైతన్య సభ’లో కత్తి మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌పై పలు విమర్శలు చేశారు. జనసేనకు జనబలం లేదని, కేవలం సినీ గ్లామర్‌తో పవన్‌ రెచ్చకొట్టే ప్రసంగాలు చేస్తున్నాడని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు. పవన్‌ను చూడడానికి మాత్రమే జనం వస్తున్నారని అన్నారు. అంతమాత్రాన వారంతా ఆయనకు ఓటు వేస్తారనుకోవడం పొరపాటన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కడా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు లేవని జోష్యం చెప్పారు.

‘ఆయన ఏ ప్రాంతానికి వెళితే అక్కడ పోటీ చేస్తానని అంటున్నారు. ఈ మధ్య పాయకారావుపేట వెళ్లినప్పుడు అక్కడి నుంచి కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. అది రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం. అక్కడ నుంచి ఎలా పోటీ చేస్తాడో ఆయనకే తెలియాలి. శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించినప్పుడు ‘మీకు నేనున్నాను’ అని పవన్ భరోసా ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనెక్కడ. అక్కడ తిత్లీ తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. కానీ ఇంత వరకు ఆయన అక్కడికి వెళ్లలేదు’ అని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.