యాప్నగరం

జేపీ సహా ఎవర్నీ వదలని కత్తి

సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి ట్వీట్లతో చెలరేగిపోయారు. మొన్నటి వరకు ఏపీ రాజకీయాలు, పవన్, ఎంపీలపై మాటల తూటాలు పేల్చిన కత్తి... ఇప్పుడు లోక్‌సత్తా అధినేత జేపీని టార్గెట్ చేశారు. కత్తి వైసీపీ, టీడీపీ, జనసేనను కూడా వదల్లేదు.

TNN 13 Feb 2018, 10:53 am
సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి ట్వీట్లతో చెలరేగిపోయారు. మొన్నటి వరకు ఏపీ రాజకీయాలు, పవన్, ఎంపీలపై మాటల తూటాలు పేల్చిన కత్తి... ఇప్పుడు లోక్‌సత్తా అధినేత జేపీని టార్గెట్ చేశారు. జేపీ గారు... ఉన్న గౌరవం ఎందుకండి పోగొట్టుకుంటారు. ప్రత్యేక హోదాను, విభజన హామీలను రాజకీయం చేయకండి... అని మవీరు మీరు ఎంత హిపోక్రటికల్‌గా అంటున్నారో చూడండి. ఇది ముమ్మాటికీ రాజకీయ అంశమే. వాటితోనే ముడిపడి ఉంటుంది. ఆ రియాలిటీతో డీల్ చెయ్యండి. ప్రజా పక్షం వహిస్తూ ఓ రాజకీయ ఉద్యమం చేయండని ట్వీటారు.
Samayam Telugu kathi mahesh tweets on jp ap politics
జేపీ సహా ఎవర్నీ వదలని కత్తి




కత్తి వైసీపీ, టీడీపీ, జనసేనను కూడా వదల్లేదు. "ప్రత్యేక హోదా మా హక్కు - ప్యాకేజి మాకొద్దు" అని వైఎస్సార్ కాంగ్రెస్ మార్చ్ 5 నుంచి ఉద్యమం మొదలుపెడుతున్నారు. దీనికి మద్దతుగా వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన మరియు ప్రజాసంఘాలు నిలబడతాయా! అని ప్రశ్నించారు. తెలుగుదేశం తెలుగు ప్రజల్ని మోసం చేసింది. బీజేపీ తెలుగుదేశాన్ని తెలుగు ప్రజల్ని మోసం చేసింది. ఈ మోసం జరిగిందా లేదా! ఎంతమేరకు జరిగింది? అని కనుక్కుంటామని జనసేన మళ్ళీ తెలుగు ప్రజల్ని మోసం చేస్తోంది. ఈ మోసం ఎవరికోసం? ఎందుకోసమన్నారు. ఇలా అందర్ని టార్గెట్ చేశారు కత్తి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.