యాప్నగరం

హైదరాబాద్‌: బ్యాంకు ఎండీపై కాల్పులు

ఆదివారం హైదరాబాద్ లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. మాసబ్ ట్యాంకులోని శాంతినగర్ లో ఉన్న సాయిదుర్గా

Samayam Telugu 18 Dec 2016, 4:13 pm
ఆదివారం హైదరాబాద్ లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. మాసబ్ ట్యాంకులోని శాంతినగర్ లో ఉన్న సాయిదుర్గా కానుమిల్లి అపార్ట్ మెంట్స్ లో నివాసముండే కేబీఎస్ బ్యాంకు ఎండీ మన్మద్ దలాల్ పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికులు హుటాహుటినా దలాల్ ను బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu kbs bank md shot in hyderabad
హైదరాబాద్‌: బ్యాంకు ఎండీపై కాల్పులు


దలాల్ పై దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్ల పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బ్యాంకులో పనిచేసే మేనేజర్ కావాలని తనను అడిగితే దలాల్ ప్లాట్ చూపించానని అపార్ట్ మెంట్ వాచ్ మేన్ చెబుతున్నాడు. దలాల్ తో వచ్చిన వ్యక్తి మాట్లాడుతుండటంతో తాను కిందికి వెళ్లానని కాసేపటికే కాల్పుల శబ్ధం వినిపించిందని అతడు పోలీసులకు చెప్పాడు. ఆగంతకుడు ఎందుకు కాల్పులు జరిపాడో కారణాలు తెలియరాలేదు. దలాల్ పై కాల్పులు జరిగినప్పుడు ఆయన ఇంట్లో ఎవరెవరూ ఉన్నారనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.