తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నూతనంగా నిర్మించిన అధికారిక నివాసం ‘ప్రగతి భవన్’లోకి గురువారం ఉదయం 5గంటల 22 నిమిషాలకు గృహ ప్రవేశం చేశారు.
నూతన గృహంలో కేసీఆర్ దంపతులు సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామితోపాటు మంత్రులు మహమూద్ అలీ, హరీశ్ రావు, కేటీఆర్, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.
దాదాపు పదేకరాల విస్తీర్ణంలో నిర్మించిన సీఎం అధికారిక నివాసానికి ప్రగతి భవన్ గా నామకరణం చేశారు. ఇక్కడ సీఎం మీటింగ్ హాల్, క్యాంపు కార్యాలయాలు నిర్మించారు. సీఎం మీటింగ్ హాలుకు ‘జనహిత’ అని పేరు పెట్టారు.
జనహిత భవన్ లో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రైతులు, కార్మికులు, ఉద్యోగులు, తదితర వర్గాలతో సీఎం సమాలోచనలు జరిపేందుకు వీలుగా నిర్మించారు.
రూ.38కోట్ల వ్యయంతో మూడు బ్లాకులుగా ఐదు భవనాల నిర్మాణం చేపట్టారు.
నూతన గృహంలో కేసీఆర్ దంపతులు సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామితోపాటు మంత్రులు మహమూద్ అలీ, హరీశ్ రావు, కేటీఆర్, ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.
దాదాపు పదేకరాల విస్తీర్ణంలో నిర్మించిన సీఎం అధికారిక నివాసానికి ప్రగతి భవన్ గా నామకరణం చేశారు. ఇక్కడ సీఎం మీటింగ్ హాల్, క్యాంపు కార్యాలయాలు నిర్మించారు. సీఎం మీటింగ్ హాలుకు ‘జనహిత’ అని పేరు పెట్టారు.
జనహిత భవన్ లో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రైతులు, కార్మికులు, ఉద్యోగులు, తదితర వర్గాలతో సీఎం సమాలోచనలు జరిపేందుకు వీలుగా నిర్మించారు.
రూ.38కోట్ల వ్యయంతో మూడు బ్లాకులుగా ఐదు భవనాల నిర్మాణం చేపట్టారు.