తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ను రాష్ట్ర ప్రజలు మరోసారి ఆశీర్వదించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట కేటీఆర్ అన్నారు. అదే విధంగా లోక్సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ రెండోసారి సీఎం కావడం దేశ చరిత్రలో రికార్డు అన్నారు. కేసీఆర్ అరుదైన నాయకుడు అని కొనియాడారు. దేశ ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై నమ్మకంతో 75శాతం సీట్లు కట్టబెట్టి అఖండమైన విజయాన్ని అందించారని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
‘ఉద్యమ స్ఫూర్తితో ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రవ్యాప్తంగా 28లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. వందకు పైగా స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. దీనికి కారణం టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై ఉన్న నమ్మకం. తెలంగాణలో టీడీపీ ఇప్పటికే ఖాళీ అయ్యింది. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. ఓటర్ నమోదు కార్యక్రమంలో సనత్నగర్ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి నామినేటెడ్ పదవులు తప్పకుండా ఇస్తాం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని’ కేటీఆర్ వివరించారు.
‘ఉద్యమ స్ఫూర్తితో ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించాలి. రాష్ట్రవ్యాప్తంగా 28లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. వందకు పైగా స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. దీనికి కారణం టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై ఉన్న నమ్మకం. తెలంగాణలో టీడీపీ ఇప్పటికే ఖాళీ అయ్యింది. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది. ఓటర్ నమోదు కార్యక్రమంలో సనత్నగర్ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి నామినేటెడ్ పదవులు తప్పకుండా ఇస్తాం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని’ కేటీఆర్ వివరించారు.