ఉద్యోగాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం కేసీఆర్ ఖండించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా శాసనసభలో సీఎం మాట్లాడుతూ.. 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించింది, ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే లక్ష వరకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పామని, 2014 నుంచి 2019 వరకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీరుతామని ఉద్ఘాటించారు.
హోంగార్డులకు న్యాయం చేస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 22 వేల మంది హోంగార్డులను క్రమబద్దీకరిస్తామని ఆయన అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు హోంగార్డుల క్రమబద్దీకరణపై సమీక్షిస్తున్నారని.. వారు త్వరలోనే నివేదిక ఇస్తారని తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలుంటే 5 నిమిషాల్లో రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ.. రాజకీయ అవినీతి చాలా తక్కువగా ఉన్న రాష్ట్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఇక నుంచి నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ విషయంలో వంద శాతం కోతలు లేకుండా చేయగలిగమన్నారు. విద్యుత్ ఉద్యోగులకు చేతులు జోడించి సలాం చేస్తున్నానని చెప్పారు. 10 వేల మెగావాట్లు ఇచ్చేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వార్ధా మహేశ్వరం విద్యుత్ లైన్ పూర్తయిందని, దేశంలో ఎక్కడి నుంచైనా మనం కరెంట్ తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాల కోసం 10 వేల మెగావాట్లు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చని చెప్పారు.
హోంగార్డులకు న్యాయం చేస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 22 వేల మంది హోంగార్డులను క్రమబద్దీకరిస్తామని ఆయన అన్నారు. పోలీసు ఉన్నతాధికారులు హోంగార్డుల క్రమబద్దీకరణపై సమీక్షిస్తున్నారని.. వారు త్వరలోనే నివేదిక ఇస్తారని తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలుంటే 5 నిమిషాల్లో రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ.. రాజకీయ అవినీతి చాలా తక్కువగా ఉన్న రాష్ట్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఇక నుంచి నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ విషయంలో వంద శాతం కోతలు లేకుండా చేయగలిగమన్నారు. విద్యుత్ ఉద్యోగులకు చేతులు జోడించి సలాం చేస్తున్నానని చెప్పారు. 10 వేల మెగావాట్లు ఇచ్చేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వార్ధా మహేశ్వరం విద్యుత్ లైన్ పూర్తయిందని, దేశంలో ఎక్కడి నుంచైనా మనం కరెంట్ తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాల కోసం 10 వేల మెగావాట్లు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చని చెప్పారు.