యాప్నగరం

కేసీఆర్ ‘కమ్మ’ని వ్యూహం.. మోత్కుపల్లి ఖుషీ!

కేసీఆర్ విసిరిన కమ్మటి పాచిక కారణంగా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వెళ్తుండగా.. మోత్కుపల్లి మాత్రం ఖుషీగా ఉన్నాడు.

TNN 20 Oct 2017, 5:55 pm
‘కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసి.. రెడ్ల ఆధిపత్యానికి చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు..’ గత కొంత కాలంగా తెలంగాణలో వినిపిస్తున్న మాట ఇది. టీఆర్ఎస్‌తో దోస్తీకి చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ ముఖ్యులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు టీడీపీ నేతలైతే ఒకడుగు ముందుకేసి తెలంగాణలో టీఆర్ఎస్‌, బీజేపీలతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఈ ‘వెల్‌ కమ్’ దోస్తీ కేసీఆర్ అంటే ఏ మాత్రం గిట్టని రేవంత్ రెడ్డికి నచ్చలేదు. నోటుకు ఓటు కేసులో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న ఆయన కేసీఆర్‌ను సీఎం పీఠం నుంచి దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కానీ పార్టీ పెద్దల ఆలోచన, కార్యాచరణ అందుకు విరుద్ధంగా ఉంది.
Samayam Telugu kcr kamma strategy will helps motkupalli narasimhulu
కేసీఆర్ ‘కమ్మ’ని వ్యూహం.. మోత్కుపల్లి ఖుషీ!


దీంతో రేవంత్ రెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో రెడ్లు అధికంగా ఉండే కాంగ్రెస్ వైపు దృష్టి సారించాల్సి వచ్చింది. ఇది రేవంత్‌కు ఎంత మేర ఉపయోగం అనేది పక్కనబెడితే.. తెలంగాణ టీడీపీకి చెందిన మోత్కుపల్లి నర్సింహులుకు మాత్రం అడ్వాంటేజ్ కానుంది. ఆయనకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు చాలా కాలం క్రితమే హామీ ఇచ్చారు. వెంకయ్య నోట కూడా గతంలో మీరు గవర్నర్ అవుతారనే మాటలు వెలువడ్డాయి. వెంకయ్య ఉపరాష్ట్రపతి అయ్యారు కానీ, మోత్కుపల్లికి మాత్రం నిరాశే ఎదురైంది.

గవర్నర్ పదవి హామీని మోత్కుపల్లి పదే పదే చంద్రబాబుకు గుర్తు చేస్తుండటంతో పార్టీ అధినేత కూడా ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారు. ఇప్పుడు రేవంత్ బయటకు వెళ్లడం వల్ల మోత్కుపల్లికి పార్టీలో ప్రాధాన్యం పెరుగుతుంది. టీఆర్ఎస్‌తో దోస్తీ వల్ల ఎంపీగా పెద్దల సభలో అడుగుపెట్టినా ఆశ్చర్యం అక్కర్లేదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కేసీఆర్ స్కెచ్ వేస్తే.. దాన్ని మోత్కుపల్లి తనకు అనుకూలంగా మలచుకోనున్నారన్న మాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.