రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్లో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. రెడ్డి హాస్టల్ భవనానికి సీఎం శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ను ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ మాడ్రన్ తెలంగాణ’గా అభివర్ణించారు. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సీఎం.. పలు కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నారని, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. సీఎం ఏ పని చేసినా మంచి కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు.
రెడ్డి విద్యార్థుల కోసం అన్ని రకాల హంగుల్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఈ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో అన్ని రకాల వర్గాల వారికి సదుపాయాలు అందించనున్నారు. రెడ్డి హాస్టల్ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రెడ్డి విద్యార్థుల కోసం అన్ని రకాల హంగుల్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఈ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో అన్ని రకాల వర్గాల వారికి సదుపాయాలు అందించనున్నారు. రెడ్డి హాస్టల్ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.