యాప్నగరం

రెడ్డి హాస్టల్ నూతన భవనానికి శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్‌లో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ చేసి నిర్మాణ..

TNN 22 Aug 2017, 6:00 pm
రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్‌లో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. రెడ్డి హాస్టల్ భవనానికి సీఎం శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌ను ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ మాడ్రన్ తెలంగాణ’గా అభివర్ణించారు. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సీఎం.. పలు కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నారని, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. సీఎం ఏ పని చేసినా మంచి కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు.
Samayam Telugu kcr lays foundation for new reddy hostel campus
రెడ్డి హాస్టల్ నూతన భవనానికి శంకుస్థాపన


రెడ్డి విద్యార్థుల కోసం అన్ని రకాల హంగుల్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఈ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌లో అన్ని రకాల వర్గాల వారికి సదుపాయాలు అందించనున్నారు. రెడ్డి హాస్టల్ స్థాపించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.