మాజీ మంత్రి, ఆందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూ మోహన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు షాక్ ఇచ్చారు. ఆందోల్ టికెట్ను బాబూ మోహన్కు ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించారు. ఆయనతో పాటు చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కూడా టికెట్ ఇవ్వలేదు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్కు ఆందోల్ టికెట్ ఇచ్చారు. అలాగే చెన్నూరు సీటును ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్కు కేటాయించారు.
తెలంగాణ శాసనసభను రద్దు చేస్తూ గురువారం మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. గవర్నర్ను కలిసిన అనంతరం తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా 105 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఐదు స్థానాలను పెండింగ్లో ఉంచామని, వాటిని ఖరారు చేయాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. చొప్పదండి, వరంగల్ ఈస్ట్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందన్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆందోల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాబూ మోహన్కు కేసీఆర్ టికెట్ నిరాకరించారు. ఎస్సీ నియోజకవర్గం అయిన ఆందోల్లో జర్నలిస్టు చంటి క్రాంతి కిరణ్కు టికెట్ ఖరారు చేశారు. ఆందోల్లో గత ముప్పై, నలభై ఏళ్లుగా స్థానికేతర నేతలే రాజ్యమేలుతున్నారని క్రాంతి ఎప్పటి నుంచో తన గొంతును వినిపిస్తున్నారు. స్థానిక దళిత నాయకులను ఎదగనీయడం లేదని గతంలో బహిరంగంగానే మండిపడ్డారు. ఈ విషయంలో బాబూమోహన్, క్రాంతి మధ్య గతంలో వాదనలు కూడా జరిగాయి. స్థానికుడినైన తనకు టికెట్ ఇస్తే పోటీచేస్తానని కూడా ప్రకటించారు. మొత్తానికి నియోజకవర్గంలో ప్రగతిని తెలుసుకున్న కేసీఆర్.. బాబూ మోహన్ను తప్పించి క్రాంతికి సీటిచ్చారు.
కాగా, తెలుగు తెరపై హాస్య నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబూ మోహన్.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ తరఫున ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్లో చేరి ఆందోల్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రాజనరసింహపై గెలిచారు. కానీ నియోజకవర్గంలో ఆయన పనితీరు బాగాలేదని కేసీఆర్ చేయించిన పలు సర్వేల్లో తేలింది. ఈసారి బాబూ మోహన్కు సీటు దక్కదనే ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్టుగానే బాబూ మోహన్ను కేసీఆర్ పక్కన పెట్టేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఆందోల్లో చక్రం తిప్పిన బాబూ మోహన్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణ శాసనసభను రద్దు చేస్తూ గురువారం మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. గవర్నర్ను కలిసిన అనంతరం తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా 105 స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఐదు స్థానాలను పెండింగ్లో ఉంచామని, వాటిని ఖరారు చేయాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. చొప్పదండి, వరంగల్ ఈస్ట్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందన్నారు.
కాగా, తెలుగు తెరపై హాస్య నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబూ మోహన్.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ తరఫున ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ చేతిలో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్లో చేరి ఆందోల్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రాజనరసింహపై గెలిచారు. కానీ నియోజకవర్గంలో ఆయన పనితీరు బాగాలేదని కేసీఆర్ చేయించిన పలు సర్వేల్లో తేలింది. ఈసారి బాబూ మోహన్కు సీటు దక్కదనే ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్టుగానే బాబూ మోహన్ను కేసీఆర్ పక్కన పెట్టేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఆందోల్లో చక్రం తిప్పిన బాబూ మోహన్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.