యాప్నగరం

రాష్ట్రమంతా ఒకేసారి పట్టాదార్ పాస్‌పుస్తకాలు: కేసీఆర్

మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు.

TNN 16 Jan 2018, 3:46 pm
మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీని కోసం ప్రతి గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో మంగళవారం (జనవరి 16) ఆయన కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీరాజ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీల విధులు, మున్సిపల్ చట్ట సవరణపై చర్చించారు.
Samayam Telugu kcr review meet on pattadar passbooks distribution
రాష్ట్రమంతా ఒకేసారి పట్టాదార్ పాస్‌పుస్తకాలు: కేసీఆర్


పాస్‌ పుస్తకాలను ఒక రోజు ముందే గ్రామాలకు తరలించాలని కలెక్టర్లను కేసీఆర్ ఆదేశించారు. దీని కోసం ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని నిర్దేశించారు. పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని సీఎం తెలిపారు.

ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనకు సిద్ధమైన నేపథ్యంలో.. పంచాయతీలు, సర్పంచులు, పాలకమండళ్లకు అధికారాలు, బాధ్యతలతో పాటు తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చే అంశంపైనా కలెక్టర్లతో సీఎం చర్చించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.