యాప్నగరం

నేటి నుంచి కేసీఆర్ ప్రాజెక్టుల సందర్శన

పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని మూడు బ్యారేజీలు, నాలుగు పంపుహౌజుల నిర్మాణాలను కూడా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు.

Samayam Telugu 1 Jan 2019, 10:08 am
తెలంగాణలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మంగళ, బుధవారాల్లో (జనవరి 1, 2) ఆయా ప్రాజెక్టులను సందర్శించనున్నారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై దృష్టిసారించనున్నారు. రెండో దశలో కొండపోచమ్మసాగర్‌, పాలమూరు-డిండి, సీతారామ ప్రాజెక్టులు సందర్శిస్తారు. వీటి తేదీలు ఖరారు కావాల్సి ఉంది. కేసీఆర్ తన పర్యటనలో భాగంగా.. మొదటా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి చేరుకోవడం ద్వారా పర్యటన ప్రారంభించనున్నారు. పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని మూడు బ్యారేజీలు, నాలుగు పంపుహౌజుల నిర్మాణాలను కూడా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు.
Samayam Telugu kcr.


నేటి పర్యటన సాగనుందిలా..
✭ మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలీకాఫ్టర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్దకు బయల్దేరుతారు.
✭మధ్యాహ్నం 1.50 గంటల వరకు బ్యారేజీ పనులు పరిశీలించి, అక్కడి నుంచి 2 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకుంటారు.
✭మధ్యాహ్నం 3.15 గంటలకు అన్నారం బ్యారేజీ చేరుకుంటారు.
✭ అన్నారం బ్యారేజీ పనులు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజీకి మధ్యాహ్నం 3.45 గంటలకు చేరుకుంటారు.
✭ సుందిళ్ల బ్యారేజీ పనులు పరిశీలించి అక్కడి నుంచి అంతర్గాం మండలంలోని గోలివాడ పంప్‌హౌస్‌కు సాయంత్రం 4:15 గంటలకు చేరుకొని పనులు పరిశీలిస్తారు.
✭ సాయంత్రం 4.45 గంటలకు గోలివాడ నుంచి బయలుదేరి కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలోని తన నివాసానికి చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.