యాప్నగరం

శారదా పీఠంలో పూర్ణకుంభంతో కేసీఆర్‌కు ఘనస్వాగతం

ఆశ్రమ ప్రతినిధులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు.

Samayam Telugu 23 Dec 2018, 3:30 pm
విశాఖపట్నం పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన కుటుంబసభ్యులతో కలిసి చినముషిడివాడలోని శారదా పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అక్కడ పీఠాధిపతి స్వరూపానందతో కలిసి రాజశ్యామల ఆలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. శారదాపీఠం ఆవరణలో ఉన్న శమీ వృక్షానికి, విజయ హనుమాన్‌కు కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర ఆశీస్సులు పొందారు. కేసీఆర్‌ సీఎం హోదాలో తొలిసారి విశాఖకు వచ్చారు. విశాఖలో కేసీఆర్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Samayam Telugu kcr2


ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం 2.15 గంటలకు భువనేశ్వర్‌ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఆదివారం రాత్రి అక్కడే బస చేసి, సోమవారం ఉదయం కోణార్క్‌, పూరీ జగన్నాథ ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం భువనేశ్వర్‌ చేరుకుని అదే రోజు కోల్‌కతా వెళ్తారు. అక్కడ పశ్చిమ్‌బంగ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశంకానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.