యాప్నగరం

ఫెడరల్ ప్రంట్ కాదు.. అదొక శూన్య ఫ్రంట్: చంద్రబాబు

కేసీఆర్, జగన్ మోదీ వెంట ఉన్నారన్న దానికి వారిద్దరూ కోల్‌కతా ర్యాలీకి రాకపోవడమే నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేసీఆర్ ఫెడరల్.. ఒక శూన్య ఫ్రంట్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Samayam Telugu 19 Jan 2019, 9:32 am

ప్రధానాంశాలు:

  • కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అసలు లేనే లేదని, అదొక శూన్య ఫ్రంట్ అని చంద్రబాబు అన్నారు.
  • కోల్‌కతా ర్యాలీకి వచ్చిన వారంతా మోదీ వ్యతిరేకులేనని అన్నారు.
  • కేసీఆర్, జగన్.. మోదీ అనుచరులేనని ఆరోపించారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu chandrababu naidu
కోల్‌కతాలో చేపట్టే ర్యాలీకి 20 పార్టీల ప్రతినిధులు హాజరవుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టనున్న ‘యునైటెడ్ ఇండియా బ్రిగేడ్’ ర్యాలీలో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు నిన్ననే కోల్‌కతా చేరుకున్నారు. ‘ఎన్నికల మిషన్ 2019’లో భాగంగా కోల్‌కతా నుంచే ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్, జగన్ తప్ప అందరూ కోల్‌కతా వచ్చారని తెలిపారు. కోల్‌కతా వచ్చినవారంతా మోదీ వ్యతిరేకులేనని పేర్కొన్నారు. కేసీఆర్, జగన్.. మోదీ వెంటే ఉన్నారన్నది దీన్ని బట్టే స్పష్టమవుతోందని చంద్రబాబు అన్నారు.
కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ అనేది అసలు లేనే లేదని, అదొక శూన్య ఫ్రంట్ అని చంద్రబాబు అన్నారు. ఏపీకి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 29సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిస్తే మొండిచేయి చూపడమే స్పెషల్ ట్రీట్‌మెంటా? అని ప్రశ్నించారు. విభజనతో అయిన గాయంపై బీజేపీ నేతలు కారం జల్లుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. అధికారం కోసం ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరదీస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. దేశంలోని ప్రముఖ ఆలయాల్లోనూ బీజేపీ అశాంతిని సృష్టిస్తోందని ఆరోపించారు. శబరిమలలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని, లోక్‌సభ ఎన్నికల వేళ రామాలయం అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.