యాప్నగరం

కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ సీటు.. ఏకగ్రీవం!

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.

TNN 29 Dec 2017, 2:10 pm
కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇక్కడ పోటీలో దిగని విషయం తెలిసిందే. అధికార పార్టీ తరఫు నుంచి కేఈ ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేయగా.. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కేఈతో పాటు మరో ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసినా అవి నిలబడలేదు. బీఎస్పీ తరఫున ఒక నామినేషన్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి అనుచరుడు ఒకరు, ఎంపీటీసీల సంఘం వైపు నుంచి ఒక నామినేషన్ దాఖలు అయ్యింది.
Samayam Telugu ke prabhar elected as mlc unanimously
కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ సీటు.. ఏకగ్రీవం!


అయితే వీటిలో రెండు చెల్లలేదు. వారి నామినేషన్లు పరిశీలన అనంతరం తిరస్కరణకు గురి అయ్యాయి. ఇక బైరెడ్డి అనచరుడు నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. బరిలో మరే నామినేషన్ లేకపోవడంతో.. కేఈ ప్రభాకర్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్టే. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటేసే ఈ ఎన్నిక పోరులో వాస్తవబలం వైసీపీకి ఉన్నా.. మెజారిటీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైసీపీ వారే ఉన్నా, టీడీపీ ఈ సీటును ఏకగ్రీవంగా సొంతం చేసుకోవడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.