యాప్నగరం

కేసీఆర్‌ను కలిసిన కేరళ సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కేరళ సీఎం పినరయి విజయన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

TNN 19 Mar 2017, 5:41 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కేరళ సీఎం పినరయి విజయన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన విజయన్.. ఆయనతో భేటీ అయ్యారు. కేసీఆర్‌తో కలసి విజయన్ భోజనం చేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు ఇరు రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో చేపట్టిన వివిధ పథకాల గురించి విజయన్‌కు కేసీఆర్ వివరించారు. అలాగే శబరిమలలో అతిథి గృహానికి సంబంధించిన కేటాయింపులను త్వరగా చేయాలని విజయన్‌ను కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శాలువాతో విజయన్‌ను సత్కరించిన కేసీఆర్ ఆయనకు జ్ఞాపిక అందజేశారు.
Samayam Telugu kerala cm pinarayi vijayan meets telangana cm kcr
కేసీఆర్‌ను కలిసిన కేరళ సీఎం


కాగా, సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్యఅతిథిగా విజయన్ హైదరాబాద్‌కి వచ్చారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో విజయన్ పాల్గొంటారు. ఇందుకోసం కేరళ సీఎం శనివారం రాత్రే నగరానికి చేరుకున్నారు. సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి, ప్రభుత్వ హామీలు అమలు డిమాండ్లతో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర ఆదివారంతో ముగిసింది. ఐదు నెలలపాటు 4 వేల కిలోమీటర్లు సాగిన ఈ సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సభకు సీపీఎం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సభకు కేరళ సీఎం సహా పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరి, పలు వామపక్ష, సామాజిక ప్రజా సంఘాల నేతలు హాజరవుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.