యాప్నగరం

ఆరు జిల్లాల పేర్లు మారుస్తూ కేబినెట్ నిర్ణయం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది.

TNN 21 Oct 2016, 6:46 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. నాలుగ్గంటల పాటూ జరిగిన ఆ సమావేశంలో పలు అంశాలపై కేబినెట్ చర్చించి, నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాకు వివరించారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుతున్న భవనాలను తెలంగాణకు ఇవ్వాల్సిందిగా గవర్నర్ ను కోరాలని కేబినెట్ తీర్మానించింది. 1047 పీఈటీ పోస్టుల క్యాడర్ ను స్కూలు అసిస్టెంట్ గా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పుపై తదుపరి కార్యచరణపై హరీష్ రావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఆ కమిటీ నివేదిక వచ్చాక ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను త్వరితగతిన చెల్లించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Samayam Telugu key decisions taken intelangana cabinet meeting
ఆరు జిల్లాల పేర్లు మారుస్తూ కేబినెట్ నిర్ణయం


కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో ఆరు జిల్లాల పేరర్లను మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి-కొత్తగూడెం, జోగులాంబ-గద్వాల, కుమ్రం భీం-ఆసిఫాబాద్, యాదాద్రి-భువనగిరి, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్- భూపాల పల్లి గా కొత్త జిల్లాలకు నామకరణం చేసింది. మహిళా ఉద్యోగులకు 90 రోజుల శిశుసంరక్షణ సెలవులు ఇచ్చింది. పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆ సెలవులను ఎప్పుడైనా వాడుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.