యాప్నగరం

విజయవాడ టు సింగపూర్.. జులై నుంచి డైరెక్ట్ ఫ్లైట్‌లు

ఏపీ ప్రగతి పథంలో మరో ముందడుగు పడింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభంకాబోతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞ‌ప్తి మేరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓకే చెప్పారు.

Samayam Telugu 7 Jun 2018, 3:30 pm
ఏపీ ప్రగతి పథంలో మరో ముందడుగు పడింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సేవలు ప్రారంభంకాబోతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞ‌ప్తి మేరకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓకే చెప్పారు. వచ్చే నెల నుంచి డైరెక్ట్ సర్వీసుల్ని నడపబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మొన్నటి వరకు బెజవాడ నుంచి సింగపూర్ వెళ్లాలంటే ప్రయాణికులు ఇబ్బందులు ఎదురయ్యేవి. హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చేది. ఈ మధ్య ప్రభుత్వం తరఫున సింగపూర్ వెళ్లిన రాజధాని ప్రాంత రైతులకు ఇదే సమస్య వచ్చింది. ఈ సమస్యల్ని చంద్రబాబు ఈశ్వరన్‌కు వివరించగా.. ఆయన ఓకే చేశారు.
Samayam Telugu Babu


విమాన సర్వీసులే కాదు.. సింగపూర్-ఏపీల మధ్య కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అమరావతిలో సమావేశమైన ఈశ్వరన్-సీఎం రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై చర్చించారు. ఏడీపీ, సింగపూర్‌ కన్సార్షియం మధ్య ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం నిర్మాణ బాధ్యతల్ని కన్సార్షియం చూసుకుంటుంది. అమరావతిలో ఏపీలో కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు చంద్రబాబు. సింగపూర్ సంస్థలు ముందుకొస్తే ఈ ప్రాజెక్టు మరింత వేగంగా ముందుకెళుతుందన్నారు. అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిన సింగపూర్ నిర్మాణంలోనూ భాగస్వామ్యం కాబోతుందన్నారు.

ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు సింగపూర్ మంత్రి ఈశ్వరన్. అమరావతి పార్టనర్‌షిప్‌ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామని.. ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించేందుకు ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. వరల్డ్‌ సిటీ సమ్మిట్‌లో అమరావతి నిర్మాణాన్ని ప్రస్తావిస్తామన్నారు ఈశ్వరన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.