యాప్నగరం

మహా గణపతి.. శోభయాత్ర మొదలైంది!

ఖైరతాబాద్ మహా గణపతి నిజమజ్జనానికి బయల్దేరాడు. ఈ శోభయాత్రను చూసేందుకు హైదరాబాద్ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఖైరతాబాద్ చేరుకున్నారు.

TNN 5 Sep 2017, 12:40 pm
ఖైరతాబాద్ మహా గణపతి నిజమజ్జనానికి బయల్దేరాడు. ఈ శోభయాత్రను చూసేందుకు హైదరాబాద్ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఖైరతాబాద్ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల కల్లా విగ్రహాన్ని నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 40వేల కిలోల బరువైన మహా గణపతిని ప్రత్యేక వాహనంపై హుస్సేన్ సాగర్‌కు తరలిస్తున్నారు. విగ్రహం అక్కడికి చేరగానే భారీ క్రేన్ల సాయంతో నిమజ్జనం చేస్తారు.
Samayam Telugu khairatabad ganapathi immersion begins
మహా గణపతి.. శోభయాత్ర మొదలైంది!


గణేష్‌ శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు 26 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, 10 మంది ఎస్పీలు, ఏడుగురు ఏఎస్పీలు, 122 మంది డీఎస్పీలు, 333 మంది సీఐలు, వెయ్యి మందికి పైగా ఎస్‌ఐలు, 80 ప్లాటూన్ల పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించారు. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్‌పై 38 భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. 15,000 సీసీ కెమెరాలతో శోభయాత్రను పర్యవేక్షిస్తున్నారు.

Click Here:ఖైరతాబాద్ మహా గణపతి శోభయాత్ర ఫొటో గ్యాలరీ



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.