యాప్నగరం

వదంతుల ఎఫెక్ట్: రేపల్లె రైల్వేస్టేషన్లో మహిళపై దాడి

వాట్సాప్ వదంతులపై పోలీసు అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. అమాయకులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో ఓ మహిళపై కొంత మంది యువకులు దాడికి పాల్పడ్డారు.

Samayam Telugu 24 May 2018, 5:52 pm
వాట్సాప్ వదంతులపై పోలీసు అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. అమాయకులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో ఓ మహిళపై కొంత మంది యువకులు దాడికి పాల్పడ్డారు. బుధవారం (మే 23) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలను అపహరించే ముఠాకు చెందిన మహిళగా భావించి యువకులు ఆమెపై దాడి చేశారు. మహిళకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో వారికి సమాధానం ఇవ్వలేకపోయింది.
Samayam Telugu repalle


యువకుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు బాధితురాలిని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గుంటూరు ఆస్పత్రికి తరలించారు.

బిహార్ ముఠాలు చిన్న పిల్లలను అపహరిస్తున్నాయంటూ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, వార్తలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే దాడులకు దిగుతున్నారు. వదంతులను నమ్మొద్దని స్వయంగా డీజీపీ చెప్పినా వినిపించుకోవడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.