యాప్నగరం

కాంగ్రెస్‌ బాటలోనే టీఆర్ఎస్ నడుస్తోంది: కిషన్‌ రెడ్డి

తెలంగాణలో రైతులను, బడుగు బలహీన వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌ బాటలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు.

Samayam Telugu 23 Jun 2018, 10:36 pm
తెలంగాణలో రైతులను, బడుగు బలహీన వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌ బాటలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. శనివారం (జూన్ 23) మార్పు కోసం బీజేపీ జనచైతన్య యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ మతోన్మాద పార్టీ ఎంఐఎంను పోషిస్తోందని అన్నారు. ఎంఐఎం నేతలు కనిపిస్తే టీఆర్‌ఎస్‌ నేతలు వంగి వంగి సలామ్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు.
Samayam Telugu కిషన్


ఇప్పటి వరకు అన్ని పార్టీలకు ఓటు వేశారు.. ఇప్పుడు బీజేపీకి ఓటువేసి మార్పు తీసుకురావాల్సిన తరుణం ఆసన్నమైందని కిషన్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ రామచందర్‌ రావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణాను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. కేసీఆర్‌ కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.