యాప్నగరం

మేం దొంగలం కాదు.. లీగల్ భూములే కొన్నాం

తాము వివాదంలో ఉన్న భూములు కొనుగోలు చేయలేదని, భూ అక్రమాలకు పాల్పడలేదని

Samayam Telugu 10 Jun 2017, 12:06 pm
తాము వివాదంలో ఉన్న భూములు కొనుగోలు చేయలేదని, భూ అక్రమాలకు పాల్పడలేదని టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని దండుమైలారంలోని 38 ఎకరాల ప్రభుత్వ భూమిని కేకే తన కోడలు, కూతుళ్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వస్తున్న నేపథ్యంలో ఆయన శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ దండు మైలారంలోని భూమలను 2013లో అగ్రిమెంట్ చేసుకున్నాం. 2015లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. చట్టప్రకారమే భూములు కొన్నాం. వివాదంలో ఉన్న భూములు కొనుగోలు చేయలేదు. తమ కుటుంబం పేర 50 ఎకరాలు కొన్నాం’ అని తెలిపారు.
Samayam Telugu kk mp of trs says there is not illegality in land purchase
మేం దొంగలం కాదు.. లీగల్ భూములే కొన్నాం


చట్టప్రకారమే తాము భూములు కొనుగోలు చేశామని.. తామేమీ దొంగలం కాదని కేకే అన్నారు. తాను పార్లమెంటు సభ్యుడినని, చట్టాలు చేసేది తామేనని, వాటిపై గౌరవం ఉందని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ కోసం తాను ఎవరిని ప్రభావితం చేయలేదని చెప్పారు.

అయితే దండుమైలారంలోని సర్వే నెంబరం 36లో కేకే కుమార్తె విజయలక్ష్మితో పాటు ఇతరుల పేర్లమీద 50 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగింది. వీరు కొన్న 50 ఎకరాల్లోని 38 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గోల్డ్ స్టోన్ కంపెనీ ఈ భూములను కేకే కుటుంబానికి అమ్మినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.