యాప్నగరం

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్యెల్యే సంచలన వ్యాఖ్యలు!

వైకాపా గుర్తుతో గెలిచి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

TNN 20 Feb 2018, 10:12 am
వైకాపా గుర్తుతో గెలిచి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఆవేదన వ్యక్తం చేశారనే వార్త గుప్పుమంటోంది. కోడుమూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఆయన, సభ్యత్వ కార్డులను విష్ణు అనుచరులు దొంగిలించారని ఆరోపించారు. సభ్యత్వ నమోదు కోసం రూ.13.50 లక్షలు చెల్లిస్తే ఇప్పటికీ తనకు, తన కార్యకర్తలకు వాటిని ఇవ్వలేదన్నారు. అబద్ధాలు ఆడాల్సిన అవసరం తనకు లేదని.. తాను టీడీపీకి అమ్ముడుపోయానని ఆత్మసాక్షిగా చెబుతున్నానని మణిగాంధీ వ్యాఖ్యానించినట్లు సమాచారం. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసే టీడీపీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారని, అయితే వాళ్లలా తాను అబద్ధాలు చెప్పలేనని అన్నట్టు భోగట్టా.
Samayam Telugu kodumuru mla manigandhi sensational comments against tdp
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్యెల్యే సంచలన వ్యాఖ్యలు!


ఆరు నెలల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని, అంతవరకు ఓపికపట్టాలని పేర్కొన్నారు. ఏ పార్టీలో ఎవరుంటారో అర్థంగాని పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. అంతేకాదు బద్వేలు ఎమ్మెల్యే జయరాముడు త్వరలో టీడీపీ నుంచి బయటకు వస్తారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజకీయాల నుంచైనా తప్పుకుంటాను కానీ విష్ణువర్ధన్‌రెడ్డితో రాజీ పడే సమస్యే లేదని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. విష్ణువర్ధన్‌రెడ్డితో రాజీ కావాలని వర్ల రామయ్య, ఇన్‌చార్జీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనను బతిమిలాడినా లెక్క చేయలేదన్నారు. తనకు సీఎం చంద్రబాబుకంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.