యాప్నగరం

40 సీట్లలో పార్టీని గెలిపిస్తాం: కాంగ్రెస్ నేత ధీమా

తమ అన్నదమ్ములిద్దరమే కాంగ్రెస్ పార్టీని 40 సీట్లలో గెలిపించగల సమర్థులం అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేయడం విశేషం

Samayam Telugu 7 Sep 2018, 6:42 pm
ఒకవైపు తను పార్టీ మారతాను అనే ఊహాగానాలను కొట్టివేస్తూ.. మరోవైపు తమ పార్టీ తెలంగాణలో సంచలన విజయాన్ని సాధించబోతోందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తను, తన సోదరుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరబోతున్నామనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాము తిరిగి కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేస్తామని.. అన్నదమ్ములిద్దరం విజయం సాధించడంతో పాటు పార్టీని కూడా గెలిపిస్తామని కోమటిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
Samayam Telugu komati-reddy-venkata-reddy


తమ అన్నదమ్ములిద్దరమే కాంగ్రెస్ పార్టీని 40 సీట్లలో గెలిపించగల సమర్థులం అని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేయడం విశేషం. నలభై స్థానాల్లో పార్టీని గెలిపించే బాధ్యత తమదే అని కోమటి రెడ్డి అంటున్నారు. నల్లగొండ నుంచి తను , మునుగోడు నుంచి తన సోదరుడు పోటీ చేసి విజయం సాధిస్తామని అన్నారు.

ఇక పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తెరాసలోకి చేరుతుండటాన్ని కోమటిరెడ్డి తప్పు పట్టారు. పోటీ చేసి గెలవగలనో లేదో అనే భయంతోనే సురేష్ రెడ్డి పార్టీ మారుతున్నారని వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి కాదు... అతిత్వరలోనే తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉంటాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.