యాప్నగరం

అనుచరులతో కొండా దంపతుల భేటీ.. ఈ నెల 23న భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం

భవిష్యత్ కార్యాచరణపై కొండా దంపతుల ఫోకస్. ఈ నెల 23న ఓ నిర్ణయం తీసుకుంటామంటున్న సురేఖ, మురళి.

Samayam Telugu 10 Sep 2018, 6:37 pm
టికెట్ పంచాయితీపై టీఆర్ఎస్‌తో తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు కొండా దంపతులు. సోమవారం హన్మకొండలోని నివాసంలో అనుచరులు, సన్నిహితులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణతో పాటూ తాజా రాజకీయాలపై చర్చించారు. తొలి జాబితాలో టికెట్ నిరాకరించకడంపై పార్టీకి కొండా సురేఖ వేసిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం రాలేదని.. ఈ నె23 వరకు వేచి చూడాలని నిర్ణయించారు. అప్పటికి స్పందించని పక్షంలో అదే రోజు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామంటున్నారు.
Samayam Telugu Konda


సురేఖకు టికెట్ ఎందుకు నిరాకరించారో చెప్పాలంటున్నారు కొండా మురళి. తాము అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం రాలేదని.. దీనిపై ఓ లేఖ కూడా రాస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా గెలిస్తామనే నమ్మకం ఉందని.. ఈ నెల 23న భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు కొండా మురళి.

టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో కొండా సురేఖకు టికెట్ నిరాకరించారు. ఆమె పోటీ చేసిన వరంగల్ తూర్పు స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. టికెట్ దక్కకపోవడంతో కొండా దంపతులు భగ్గుమన్నారు. ఈ నెల 8న మీడియాతో మాట్లాడిన సురేఖ.. పార్టీ తీరుపై మండిపడ్డారు. బీసీ మహిళకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వకుండా తనను అవమానించారని.. తాను చేసిన తప్పేంటో చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.