యాప్నగరం

సీఎం మాఇంటికి వస్తానని, రాలేదు: కోట్ల

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటికి వస్తారని చెప్పి, మళ్లీ రాలేదని తెలిపారు

TNN 20 Sep 2017, 1:47 pm
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటికి వస్తారని చెప్పి, మళ్లీ రాలేదని తెలిపారు కర్నూలు మాజీ ఎంపీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నిన్న కర్నూలు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోట్ల వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తన ఇంటికి వస్తారని.. ముందుగా పోలీసులు తనకు సమాచారం అందించారని కోట్ల చెప్పారు. భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో పోలీసులు వచ్చి తనకు సమాచారం ఇచ్చారన్నారు. అయితే.. మళ్లీ ఏమైందో కానీ, సీఎం తన ఇంటికి రాలేదని కోట్ల చెప్పారు.
Samayam Telugu kotla again clears he wont leave congress
సీఎం మాఇంటికి వస్తానని, రాలేదు: కోట్ల


ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ముఖ్యమంత్రి తన ఇంటికి వచ్చి అడిగి ఉన్నా తను కాంగ్రెస్ పార్టీని వీడే వాడిని కానని కోట్ల చెప్పడం. గత కొన్నాళ్లుగా కోట్ల కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీలో చేరతాడనే ప్రచారం ఉంది. అయితే.. ఆ ప్రచారాన్ని ఈ మాజీ ఎంపీ ఖండిస్తూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను వీడను అని మరోసారి స్పష్టం చేశారు. వ్యవసాయం అయినా చేసుకుని బతుకుతాను కానీ, పార్టీ మారను కోట్ల ఖరాఖండిగా చెప్పారు. తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి చంద్రబాబు తన ఇంటికి వచ్చి ఉన్నా తను ఇదే మాటే చెప్పేవాడనని ఆయన అన్నారు. ఇకపై ఎప్పుడు అయినా.. ముఖ్యమంత్రి తన ఇంటికి వస్తే సాదరంగా ఆహ్వానిస్తాను అని, తెలుగుదేశంలో చేరను అని కోట్ల వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.