యాప్నగరం

గ్యాస్ సిలిండర్ల లారీని ఢీకొట్టిన బస్సు

కర్నూలు జిల్లా డోన్‌ పట్టణ పరిధిలో సోమవారం (అక్టోబర్ 2) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కేఎస్‌ఆర్టీసీ ఐరావత్‌ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న గ్యాస్‌ సిలిండర్ల లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

TNN 2 Oct 2017, 1:25 pm
కర్నూలు జిల్లా డోన్‌ పట్టణ పరిధిలో సోమవారం (అక్టోబర్ 2) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కేఎస్‌ఆర్టీసీ ఐరావత్‌ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న గ్యాస్‌ సిలిండర్ల లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖాళీ సిలిండర్ల లారీ కావడంతో పెను ప్రమాదం తప్పింది.
Samayam Telugu ksrtc bus hits gas cylinders lorry in kurnool 1 killed
గ్యాస్ సిలిండర్ల లారీని ఢీకొట్టిన బస్సు


హైదరాబాద్‌ వైపు వస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు డోన్‌ మలుపు దగ్గర అతివేగం కారణంగా అదుపుతప్పి ముందు వెళ్తున్న డోన్‌ ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఆ తర్వాత వేగంగా దూసుకెళ్లి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న హెచ్‌పీ ఖాళీ సిలిండర్ల లారీని ఢీకొంది. ఈ ఘటనతో 2 గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.