యాప్నగరం

కేసీఆర్ మార్కుల పోటీలో వెనుకబడ్డ కేటీఆర్

మంత్రి హరీష్ రావు, ప్రతిపక్ష నేత జానా రెడ్డి వంటి వాళ్ల కన్నా కేటీఆర్ కు తక్కువ మార్కులే దక్కాయి.

TNN 10 Mar 2017, 6:05 pm
తెలంగాణ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేక సర్వేను చేయించి, ముఖ్యమంత్రి కేసీఆర్ వేయించిన మార్కులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ జాబితాలో కేసీఆర్ కే ఎక్కువ మార్కులు దక్కాయి. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ కు ఈ అధ్యయనం ప్రకారం వందకు 96.70 మార్కులు దక్కాయి. కేసీఆర్ తర్వాతి స్థానంలో నిలిచారు మంత్రి ఈటల రాజేందర్. ఎమ్మెల్యేగా ఈటలకు 89.90 మార్కులు దక్కాయి. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేగా ఈయనకు 84.70 మార్కులు దక్కాయి.
Samayam Telugu ktr far behind in kcr ratings
కేసీఆర్ మార్కుల పోటీలో వెనుకబడ్డ కేటీఆర్


శాసనసభలో ప్రతిపక్ష నేత జానా రెడ్డికి 63.20 మార్కులు వచ్చాయి. పీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి 53.70 మార్కులతో నిలిచారు. రేవంత్ రెడ్డికి 49.80 మార్కులు వచ్చాయి. స్పీకర్ మధుసూదనా చారికి 50.20 మార్కులు దక్కాయి.

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ కు 57.10 మార్కులు దక్కాయి. అత్యల్ప మార్కులు పొందారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఈయన కేవలం 24.40 మార్కులు మాత్రమే పొందారు. విశేషం ఏమిటంటే.. కేసీఆర్ చేయించిన ఈ సర్వేలో ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ వెనుకబడటం. ఎమ్మెల్యేగా కేవలం 60 మార్కలను మాత్రమే పొందారు కేటీఆర్. మంత్రి హరీష్ రావు, ప్రతిపక్ష నేత జానా రెడ్డి వంటి వాళ్ల కన్నా కేటీఆర్ కు తక్కువ మార్కులే దక్కాయి. మంత్రుల్లో కూడా పనితీరు విషయంలో కేటీఆర్ తొలి మూడు స్థానాల్లో నిలవలేకపోయాడని ఈ సర్వే చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.