యాప్నగరం

నగరంలో 826 ఆధునిక ఏసీ బస్‌షెల్టర్లు.. వైఫై, కేఫ్: కేటీఆర్

విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్‌ నగరం మణి మకుటంలో కొత్త సొబగులు చేరాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భాగ్యనగరంలో నిర్మించిన అత్యాధునిక బస్ షెల్టర్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు.

Samayam Telugu 31 May 2018, 6:51 pm
విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్‌ నగరం మణి మకుటంలో కొత్త సొబగులు చేరాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భాగ్యనగరంలో నిర్మించిన అత్యాధునిక బస్ షెల్టర్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఇలాంటి అత్యున్నత స్థాయి ఆధునిక బస్ షెల్టర్లను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 826 ప్రాంతాల్లో ఇప్పటికే ఆధునిక బస్‌ షెల్టర్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో ఖైరతాబాద్, కూకట్‌పల్లిలో నిర్మాణాలు పూర్తయిన బస్‌ షెల్టర్లను కేటీఆర్ గురువారం (మే 31) ప్రారంభించారు.
Samayam Telugu ktr


ఈ ఆధునిక బస్‌ షెల్టర్లలో సీసీ కెమెరాలు, వైఫై, కేఫ్‌, అలారమ్, ఏసీ, మంచినీరు, ఫ్యాన్లు, డస్ట్‌బిన్‌లు, టాయిలెట్లు, టికెట్‌ కౌంటర్లు, ఫీడింగ్ రూం, ఎమర్జెన్సీ హారన్ లాంటి అత్యానిధునిక సౌకర్యాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. పాశ్చాత్య దేశాల్లోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఇలాంటి బస్‌ షెల్టర్లు ఉన్నాయని ఆయన చెప్పారు.

ప్రస్తుతం నగరంలోని శిల్పారామం, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులలో ఈ బస్‌ షెల్టర్లు అందుబాటులోకి వచ్చాయి. 6 నెలలలోగా మిగిలివన్నీ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు త్వరలో 3800 ఆర్టీసీ బస్సులను ఆధునీకరించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 500 ఎలక్ట్రిక్ బస్‌లను ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు.

హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చుదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని కేటీఆర్ అన్నారు. ఆధునిక బస్ షెల్టర్లను ప్రజలే కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పీపీపీ పద్ధతిలో జీహెచ్‌ఎంసీ ఈ ప్రపంచ స్థాయి బస్ షెల్టర్ల నిర్మాణం చేపడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.