యాప్నగరం

భాగ్యనగర సిగలో మరో అద్భుత నిర్మాణం..

భాగ్యనగర పర్యాటక సిగలో మరో అద్భుత నిర్మాణానికి అంకురార్పణ పడింది.

TNN 26 Apr 2017, 4:15 pm
భాగ్యనగర పర్యాటక సిగలో మరో అద్భుత నిర్మాణానికి అంకురార్పణ పడింది. దుర్గం చెరువుపై 1.048 కిలోమీటర్ల పొడవున వేలాడే వంతెన నిర్మాణానికి తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ ఇవాళ (ఏప్రిల్ 26) శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ. 3.5 కోట్లతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ పనులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించడానికే రూ. 184 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నాం. నగర టూరిజానికి దుర్గం చెరువును ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతాం’ అన్నారు.
Samayam Telugu ktr lays foundation stone for cable bridge across durgam cheruvu in hyderabad
భాగ్యనగర సిగలో మరో అద్భుత నిర్మాణం..


ఈ వంతెన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ రూ. 92 కోట్లు, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) రూ. 92 కోట్లు భరించనున్నాయి. దీని నిర్మాణాన్ని ఏడాది నుంచి 14 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.