యాప్నగరం

కేరళకు సాయంగా కేటీఆర్ జీతం.. కదిలిన ప్రజాప్రతినిధులు

గత వందేళ్లలో ఎన్నడూ కనీవిని ఎరగని వరదలతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకోవడం కోసం కేటీఆర్ వ్యక్తిగతంగా ముందుకొచ్చారు.

Samayam Telugu 19 Aug 2018, 8:15 am
గత వందేళ్లలో ఎన్నడూ కనీవిని ఎరగని వరదలతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకోవడం కోసం కేంద్ర, రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, సినీ నటులు, సామాన్యులు తమ వంతుగా తోచిన సాయం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల సాయాన్ని ప్రకటించింది. 100 టన్నుల బాలామృతాన్ని, రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో యంత్రాలను కూడా కేరళకు పంపింది. ఇది కాకుండా.. మంత్రి కేటీఆర్ తనవంతుగా నెల జీతాన్ని కేరళకు ఆర్థిక సాయంగా ఇస్తానని ప్రకటించారు.
Samayam Telugu ktr donation


చెక్‌ను సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపిస్తానని చెప్పిన కేటీఆర్.. సహచర ప్రజాప్రతినిధులు కూడా సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేరళకు అండగా తెలంగాణ నిలబడుతుందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
మంత్రి పిలుపునకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసిద్దీన్ సహా.. పలువురు ప్రజాప్రతినిధులు స్పందించారు. తమ వంతుగా నెలజీతాన్ని కేరళ వరద బాధితులకు విరాళంగా ఇస్తామని మాటిచ్చారు. కేటీఆర్ నిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ వంతు నెల జీతాన్ని ఆర్థిక సాయంగా అందించడం గొప్ప విషయమని మంత్రిని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.