యాప్నగరం

కవితకు మర్యాద ఇవ్వలేను!

ఆర్మూర్‌ ‘జనహిత ప్రగతి సభ’లో మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

TNN 6 Apr 2017, 6:05 pm
ఆర్మూర్‌ ‘జనహిత ప్రగతి సభ’లో మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ అన్నాచెల్లెళ్లు తొలిసారిగా అధికారికంగా ఒకే వేదికను పంచుకొని కనువిందు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తన చెల్లెలు కవితను కొనియాడారు. భారత పార్లమెంట్‌లో అద్భుతంగా ప్రసంగించే అయిదుగురిలో ఎంపీ కవిత ఒకరని కేంద్ర మంత్రి ఒకరు కితాబిచ్చారని ఆయన తెలిపారు. అందుకే కవితను చూస్తే.. తనకు గర్వంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనను ‘కవిత’ అని పిలిచి, ఇవ్వాళ ‘ఎంపీగారు’ అని పిలవాలని అనిపించడం లేదని ఆయన అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఆమెకు మర్యాద ఇవ్వలేనని, ‘కవిత’ అని సంబోధించడమే తనకు ఇష్టమని, చిన్ననాటి నుంచి తనతో ఉన్న అనుబంధమే దానికి కారణమని ఆయన తెలిపారు.
Samayam Telugu ktr praises his sister kavitha at trs meeting in armoor
కవితకు మర్యాద ఇవ్వలేను!


అంతకుముందు సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ.. ‘కేటీఆర్.. నాకే కాదు, తెలంగాణ ఆడ బిడ్డలందరికీ సోదరుడు’ అని అన్నారు. నిజామాబాద్‌కు సంబంధించిన సమస్యలను ఆమె.. మంత్రి దృష్టికి తీసుకొస్తూ.. రామన్న మన అందరికీ అన్న, మనందరి కష్టాలనూ ఆయన తీర్చుతారని పేర్కొన్నారు. తనకు ఆత్మీయ సోదరుడు ఉన్నందుకు గర్విస్తున్నానని కవిత తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.