యాప్నగరం

రాష్ట్రానికి త్వరలో ఉక్కు కర్మాగారం: కేటీఆర్‌

విభజన చట్టంలోని హామీల మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఉక్కు కర్మాగారం రాబోతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మైనింగ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మైనింగ్‌ టుడే 2018’ సదస్సులో ప్రసంగించారు.

TNN 15 Feb 2018, 12:03 am
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణలో గనుల రంగంలో గొప్ప పురోగతి సాధించామని.. పారదర్శక విధానాలు అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. విభజన చట్టంలోని హామీల మేరకు రాష్ట్రానికి ఉక్కు కర్మాగారం రాబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మైనింగ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మైనింగ్‌ టుడే 2018’ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సులభతర వాణిజ్యంలో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. టీఎస్‌‌ఐపాస్‌ పారిశ్రామిక విధానానికి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పారు.
Samayam Telugu ktr talks in mining today 2018 conference in hyderabad
రాష్ట్రానికి త్వరలో ఉక్కు కర్మాగారం: కేటీఆర్‌


దక్షిణ భారతదేశంలో తెలంగాణలోనే బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ‘తెలంగాణలో గ్రానైట్ గనులున్నాయి. గ్రానైట్ పరిశ్రమ వృద్ధికి అనేక చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో అత్యుత్తమ శాండ్ పాలసీ తీసుకొచ్చాం. కొత్త ఇసుక విధానం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతూ.. ప్రజలకు ఇసుక అందిస్తున్నాం’ అని కేటీఆర్ అన్నారు.

రాష్ట్రంలో అతిపెద్ద బొగ్గు గనులు సింగరేణి గనులు ఉన్నాయని, ఐరన్‌ ఓర్‌ గనులు కూడా సంవృద్ధిగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, గవర్నర్‌ నరసింహన్‌ హాజరయ్యారు.

4 రోజుల పాటు జరగనున్న సదస్సులో ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై చర్చ జరగనుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికాకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.