యాప్నగరం

వేరే వ్యక్తితో వెళ్లిపోయిన భార్య.. పిల్లల్ని హతమార్చిన భర్త

కట్టుకున్న భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోవడంతో.. తీవ్ర మనస్థాపానికి లోనైన ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడటానికి విఫలయత్నం చేశాడు.

Samayam Telugu 8 Oct 2018, 10:48 am
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య వదిలి వెళ్లడంతో.. మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన ధనోజీరావుకి ఝాన్సీ లక్ష్మీబాయితో పదేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి లిఖిత (7), మధు (4) అనే ఇద్దరు పిల్లలున్నారు.
Samayam Telugu jupadu-bangla


గత కొంత కాలంగా భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఝాన్సీ భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. భార్య తనను వదిలి వెళ్లడంతో మనస్థాపానికి గురైన ధనోజీరావు సోమవారం తెల్లవారుజామున కుమార్తెను గొంతుకోసి హతమార్చాడు. తర్వాత కుమారుణ్ని నీటి తొట్టిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. అనంతరం తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ తాడు తెగిపోవడంతో కింద పడిపోయాడు. తర్వాత ఆత్మహత్య యత్నం మానుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.