యాప్నగరం

విసిరేసిన పదవిని పోటీపడి ఏరుకుంటున్నారు: శిల్పా చక్రపాణి రెడ్డి

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ పేరు ఖరారైంది. జిల్లా నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.

TNN 25 Dec 2017, 8:15 pm
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రభాకర్‌ పేరు ఖరారైంది. జిల్లా నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో రెండ్రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడైన ప్రభాకర్.. గతంలో అవకాశం దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నారు.
Samayam Telugu kurnool mlc polls ke prabhakar to enormously elect
విసిరేసిన పదవిని పోటీపడి ఏరుకుంటున్నారు: శిల్పా చక్రపాణి రెడ్డి


సోమవారం (డిసెంబర్ 25) ఉదయం నుంచి రెండు దఫాలుగా సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. చల్లా రామకృష్ణారెడ్డి, కేఈ ప్రభాకర్‌, శివానందరెడ్డి తదితరులతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వేర్వేరుగా భేటీ అయిన చంద్రబాబు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. అవకాశం దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ సంచలన ప్రకటన చేసింది. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ‘నైతిక విలువలకు కట్టుబడే రాజీనామా చేశా.. రాజీనామా చేసిన పదవి కోసం మళ్లీ పోటీ చేయాల్సిన అవసరం లేదు. విసిరేసిన పదవిని టీడీపీ నేతలు పోటీపడి ఏరుకుంటున్నారు’ అని వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ గడువు మంగళవారంతో ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ప్రకటించడంతో కేఈ ప్రభాకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.